Sai Pallavi shocks Nandamuri hero

మరో హీరోకు సాయి పల్లవి షాక్ !

సాయి పల్లవి మంచి నటి అయినప్పటికీ ఎప్పుడు వివాదాస్పద వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారి నాగ శౌర్య సినిమా షూటింగ్ కు లేట్ గా వస్తుందని వార్తలు వినిపించాయి. ఆ తరువాత బెల్లంకొండ శ్రీ9నివాస్ సినిమాకు కోటి రూపాయలు ఇస్తామన్న చేయనని చెప్పిన వార్తా సంచలనం అయ్యింది.. తాజాగా ఈ హీరోయిన్ మరో హీరో సినిమా చేయనని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

మజ్ను సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు విరించి వర్మ కల్యాణ్ రామ్ తో సినిమా చెయ్యడానికి కథ సిద్దం చేశాడు. సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవిని అడిగారట, కానీ ఈ హీరోయిన్ కల్యాణ్ రామ్ పక్కన చేయనని చెప్పినట్లు సమాచారం.

సాయి పల్లవి చాలా చిన్న డాన్సర్ స్థాయి నుండి హీరోయిన్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు డబ్బు కోసం వచ్చిన సినిమాలు అన్నీ ఒప్పుకుంటే ఆమె ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోతుంది. ఆ తరువాత సినిమాలు రావని, మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతోంది ఈ హీరోయిన్. తాజాగా ఈ అమ్మాయి నటించిన పడిపడిలేచే మనసు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Facebook Comments
Share

This website uses cookies.