Vijayendra Prasad’s directional Srivalli completes shoot, teaser on December 24th

శ్రీవల్లి షూటింగ్ పూర్తి.. 24 న టీజర్ విడుదల

రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీవల్లి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్ ఈ నెల 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ..రాజన్న చిత్రం తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గారి దర్శకత్వం లో ఈ చిత్రం నిర్మించే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగానూ, ఆనందం గానూ వుంది.

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ శ్రీవల్లి. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 24 న విడుదల చేయనున్నాము. ఈ చిత్రం ద్వారా రజత్‌ హీరోగా, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నాము... అన్నారు.

రాజీవ్‌కనకాల, అరహన్‌ఖాన్, సుఫీ సయ్యద్, హేమ, సత్యకృష్ణ, కెప్టెన్ చౌదరి, ఝాన్సీ, రేఖ, మాస్టర్ సాత్విక్, మాస్టర్ సమీర్, బేబి సమ్రీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.

Facebook Comments
Share

This website uses cookies.