Junior Manyam Puli to visit theaters

థియేటర్స్ కు రానున్న జూనియర్ మన్యంపులి

మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'మన్యంపులి' బ్లాక్ బస్టర్ హట్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మన్యంపులి టీమ్ డిసెంబర్ 6 నుంచి థియేటర్స్ లో ప్రేక్షకుల్ని స్వయంగా కలుసుకోబోతున్నారని నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలిపారు. అలానే ఈ చిత్రంలో జూనియర్ మోహన్ లాల్ గా నటించిన మాస్టర్ అజాస్ కూడా ఉండబోతున్నాడని కృష్ణారెడ్డి చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో మోహన్ లాల్ నటనకి ఎంత రెస్పాన్స్ వస్తుందో అదే రేంజ్ లో బాటనటుడు అజాస్ కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అజాస్ లో స్పార్క్, బాడీ లాంగ్వేజ్ చాలా మెచ్యూర్డ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

అందుకు తగ్గట్లుగానే మన్యంపులి లో అజాస్ పై అత్యఅద్భుతంగా చిత్రీకరించారు. దీంతో ఈ జూనియర్ మన్యంపులికి పిల్లలు. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా రోజు రోజుకి ఊపందుకుంటున్నాయని వినిపిస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలకి పైగా చిత్రీకరించిన ఈ సినిమాకు షాజీకుమార్ కెమెరా వర్క్, పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, గోపీ సుందర్ మ్యూజిక్ మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి. ఈ టెక్నీషయన్ల పనితనంతో పాటు అజీస్ పలికించిన హావభావాలు, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటన మన్యంపులిని ఓ విజువల్ వండర్ గా మార్చేసాయని క్రిటిక్ర్ అభిప్రాయం. ఇదే తరహా రెస్పాన్స్ కూడా ఆడియెన్స్ నుంచి వస్తోందని మన్యంపులి చిత్ర బృందం చెబుతోంది. ఈ నేపథ్యంతోనే అజీస్ తో ధియేటర్స్ కవరేజ్ ప్రోగ్రామ్ ఏర్పాట్ చేస్తున్నట్లుగా నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ప్రకటించారు.

Facebook Comments
Share
More

This website uses cookies.