కొందరు పైరసీ దారులు ఆన్లైన్లో 'ధర్మయోగి' చిత్రాన్ని పోస్ట్ చేసినట్టు సమాచారం అందడంతో హైదరాబాద్లోని యాంటీ పైరసీ సెల్కి ఫిర్యాదు చేశారు నిర్మాత సి.హెచ్.సతీష్కుమార్. వారు వెంటనే స్పందించి ఆన్లైన్లో వున్న 'ధర్మయోగి' చిత్రాన్ని తొలగించారు. అంతేకాకుండా అది ఏ ఐపి అడ్రస్ ద్వారా పోస్ట్ అయిందనే విషయంపై ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని నిర్మాత తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేస్తే ఐపి అడ్రస్ ఆధారంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ధర్మయోగి చిత్రాన్ని పైరసీ ద్వారా చూడొద్దని, దానివల్ల మంచి చిత్రాలు తీసే నిర్మాతలు భారీగా నష్టపోతారని, కాబట్టి థియేటర్లలోనే సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యాలని ఈ సందర్భంగా నిర్మాత సతీష్కుమార్ ప్రేక్షకులను కోరారు.
This website uses cookies.