Deyyam Unda audio release on November 20th

"దెయ్యం ఉందా?" నవంబర్ 20న ఆడియో విడుదల

చాంద్ బాష దర్శకత్వంలో, ఆనంద్, కార్తిక్, రాజ్ కుమార్, అనూష, లక్ష్మి లు హీరో హీరోయిన్లుగా శ్రీ మహేశ్వరి పరమేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం "దెయ్యం ఉందా?".

ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర దర్శకుడు చాంద్ బాష మాట్లాడుతూ "అంతర్వేది, వైజాగ్, గోవా, భీమవరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని నవంబర్ 20న ఆడియో విడుదల చేసుకోనుంది. ప్రస్తుత సమాజంలో దెయ్యాలున్నాయా ? లేదా ? ప్రజలలో అపోహలు తప్ప ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ తెలియదు. అసలు దెయ్యాలున్నాయా ? లేవా ? అనేది సినిమా విడుదల వరకు ఆగాలి.

ఈ చిత్రంలో కొత్త, పాత తరం నటులు నటించారు" అని అన్నారు. ఈ చిత్రంలో వంశీ, వెంకట్, కొండవలస, సుమన్ శెట్టి, చిట్టిబాబు, ప్రణవ్, సాయి, కోట శంకర్ రావు, శ్రీకాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : ఆనంద్, పాటలు : శ్రీను, ఎడిటర్ : సుబ్రహ్మణ్య రాజు, మ్యూజిక్ : నరేష్ జయరాజ్, సహ నిర్మాత : సల్మాన్ ఖాన్, నిర్మాత : ఖాదర్ బాబు, తారహా భేగం, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : చాంద్ బాష.

Facebook Comments
Share

This website uses cookies.