Meelo Evaru Koteeswarudu movie shooting wrapped

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్‌ పూర్తి

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షూటింగ్‌ పూర్తయింది.

అక్టోబర్‌ 19న ఆడియో

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. సత్తిబాబు, నవీన్‌చంద్ర కాంబినేషన్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీవసంత్‌ అందించిన మ్యూజిక్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. అక్టోబర్‌ 19న ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ చివరి వారంలోగానీ, నవంబర్‌ మొదటి వారంలోగానీ వరల్డ్‌వైడ్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాస్‌ చేస్తున్నాం'' అన్నారు.
నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

Facebook Comments
Share

This website uses cookies.