ఖయ్యుమ్, నందినీ కపూర్ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్ కుమార్ నిర్మిస్తున్న పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'డర్టీగేమ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాడి మనోహర్ కుమార్ మాట్లాడుతూ..దర్శకుడు పక్కా ప్లానింగ్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ పూర్తి చేసుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోట శంకర్ రావు గారు డబ్బింగ్ చెబుతున్నారు. ఆయన ఇందులో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. వర్తమాన రాజకీయ నేపథ్యంతో పూర్తి ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం ఉంటుంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి.. అక్టోబర్లో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాము. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము..అని అన్నారు.
ఖయ్యుమ్, నందినీ కపూర్, పరుచూరి గోపాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, సురేష్, కోట శంకర్ రావు, అస్మిత, రమ్య, తాడి మనోహర్ నాయుడు, జబర్ధస్త్ టీమ్ మొదలగువారు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాత: తాడి మనోహర్ కుమార్, కథ-మాటలు-పాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ.
This website uses cookies.