Rashmi Gautham’s Antham releasing in 300 theaters

సెన్సారు వారిచ్చిన A స‌ర్టిఫికేట్ తో 300 దియోట‌ర్స్ లో ర‌ష్మి గౌత‌మ్‌ 'అంతం' రేపే విడుదల

'గుంటూరు టాకీస్' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంతో యువ‌త హ్రుద‌యాల్లో ప‌ర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్ర‌దాన‌పాత్ర‌లో న‌టించిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ చాలా పెర్‌ఫెక్ట్ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించిన చిత్రం 'అంతం'. ఈచిత్రం సెన్సారు వారి అభినంద‌న‌ల‌తో A స‌ర్టిఫికేట్ తో 300 కి పైగా దియోట‌ర్స్ లో రేపే విడుద‌ల‌వుతుంది. కార్తిక్ సంగీతమందించాడు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా 'అంతం' చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను. గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రష్మీ గౌతమ్ మా చిత్రంలో గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చింది. అప్పుడే పెళ్ళి చేసుకున్న అంద‌మైన జంట జీవితంలోకి అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురై వారి జీవితాన్ని తుంచేస్తున్న స‌మ‌యంలో ఆ జంట ఎలా ఎదుర్కున్నారు.. అనేది ఈ చిత్ర ముఖ్య‌క‌థాంశం. ఈ చిత్రం చూసిన త‌రువాత హీరోయిన్ ర‌ష్మి ఫెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుతారు. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత ర‌ష్మి న‌టించిన చిత్రం కావ‌టం తో ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ వుంది. ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క క‌లిపి 300 దియోట‌ర్స్ కి పైగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాము.అంద‌రి అంచ‌నాలు త‌ప్ప‌కుండాఅందుకుంటాము. A సర్టిఫికెట్ తొ మా చిత్రం రేపే విడుద‌ల‌వుతుంది. అని అన్నారు.

నటీనటులు
రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్

సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ - రామ్ సుంకర
సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్

Facebook Comments
Share

This website uses cookies.