Sumanth Ashwin’s next with Suraksha Entertainments Media

సుమంత్ అశ్విన్‌తో మల్కాపురం శివకుమార్ నూతన చిత్రం!

రొటిన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకునే యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ హీరోగా మరో నూతన చిత్రం రూపొందనుంది. హీరో నితిన్‌తో ద్రోణ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భద్రాద్రి, ఆకాశంలో సగం, సూర్య వర్సెస్ సూర్య, శౌర్య వంటి విభిన్న చిత్రాలను నిర్మించి.. అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు పొందిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై నిర్మించబోతున్నాడు.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ వైవిధ్యమైన కథ, కథనాలతో చిత్రాలను తెరకెక్కించాలనే సంకల్పంతో మా సంస్థలో విభిన్నమైన చిత్రాలను నిర్మిస్తున్నాను. అందులో భాగంగానే సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథ, కథనాలతో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలుంటాయి. సుమంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలవబోయే  ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.

Facebook Comments
Share
More

This website uses cookies.