Social News XYZ     

Central Minister Venkaiah Naidu appreciates Brahmotsavam

కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పే చిత్రమే బ్రహ్మోత్సవం’ – కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

Central Minister Venkaiah Naidu appreciates Brahmotsavam

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్‌గా పి.వి.పి. సినిమా-ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్స్‌పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం మే 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయి భారీ ఓపెనింగ్స్‌ ని సాధించి, సూపర్‌హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ పెర్‌ఫార్మెన్స్‌, కాజల్‌, సమంత గ్లామర్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, రత్నవేలు ఫొటోగ్రఫీ, తోట తరణి సెట్స్‌, మిక్కీ జె. మేయర్‌ సంగీతం, గోపీ సుందర్‌ రీ-రికార్డింగ్‌, పివిపి ప్రొడక్షన్‌ వేల్యూస్‌ సినిమా ప్రధానాంశాలుగా నిలిచాయి. కాగా ఈ చిత్రంపై అటు అభిమానుల్లోనూ,ఇటు ఇండస్ట్రీలోనూ మంచి రెస్పాన్స్‌ ను రాబట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని ఆదివారం రోజున సినీమ్యాక్స్ లో ఈ చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం....

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘’సినిమాలో కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని  ఈ చిత్రంలో అందంగా చూపించారు, మంచి సందేశాన్నిచ్చారు. ఇప్పుడు అందరూ చాలా బిజీగా, వేగవంతమైన జీవితాలను గడుపుతున్నారు. కానీ అందరూ కలిసి ఉండాలనే ఉత్తమమైన, ఉదాత్తమైన ఆలోచనను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చక్కగా తెరకెక్కించారు. మహేష్ సినిమాలో ఏదో నటిస్తున్నట్లు కాకుండా మనం సాధారణంగా ఎలా ఉంటామో అలా కనిపిస్తూనే అద్భుతమైన నటనను ప్రదర్శించారు.  ప్రతి సీన్‌'బ్రహ్మోత్సవం'లాగానే వుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా. అందరూ మంచి క్యారెక్టర్స్‌ చేసారు. పివిపిగారు సినిమాను చాలా రిచ్ గా, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉండేలా నిర్మించారు.  రత్నవేలు ఫొటోగ్రఫీ బ్యూటిఫుల్‌గా వుంది. సినిమా చాలా బాగుంది. పి.వి.పి. చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంతమంచి సినిమా తీసినందుకు శ్రీకాంత్‌ అడ్డాలకి, పివిపికి థాంక్స్‌. అందరూ కలిసి చూసే మంచి కుటుంబ కథా చిత్రం’’అన్నారు.

 

Facebook Comments

%d bloggers like this: